మంచినీటి చెరువులను అభివృద్ధి చేస్తా : మంత్రి
ABN , First Publish Date - 2021-04-13T05:42:40+05:30 IST
గ్రామాల్లో ఉన్న చెరువులను మంచినీటి చెరువులుగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు.
ఆచంట ఏప్రిల్ 12 : గ్రామాల్లో ఉన్న చెరువులను మంచినీటి చెరువులుగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఆచంట వేమవరం, వల్లూరు గ్రామాల్లో సోమవారం పర్యటించారు. గ్రామాల్లో ఉన్న చేపల చెరువుల వల్ల నీరు కలుషితమై తాగునీటి ఇబ్బందులు వస్తుంద న్నందున చెరువులన్నింటిని అభివృద్ధి చేసి తాగునీటి సమస్య పరిష్కరిస్తామ న్నారు. దీనికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ డీఈ వెంకట్రావు, సర్పంచ్ చంటి, తదితరులు పాల్గొన్నారు.