నేడు జిల్లాలో మంత్రి పువ్వాడ పర్యటన
ABN , First Publish Date - 2020-02-20T10:20:18+05:30 IST
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు.
ఖమ్మం కార్పొరేషన్, ఫిబ్రవరి 19: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఖమ్మం నుంచి పాల్వంచ చేరుకుని, అక్కడి సుగుణా గార్డెన్స్లో ఏర్పాటుచేసిన ఏర్పాటుచేసిన పల్లె ప్రగతి పంచాయతీరాజ్ సమ్మేళనంలో పాల్గొంటారు.
అనంతరం మధ్యాహ్నం 2గంటలకు కొత్తగూడెం చేరుకొని, కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటుచేసిన పట్టణ ప్రగతి సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. తరువాత సాయంత్రం 5గంటలకు ఖమ్మం చేరుకొని రాత్రి బస చేస్తారని మంత్రి ఓఎస్డీ ఒక ప్రకటనలో తెలిపారు.