దసరా నాటికి దంసలాపురం రోడ్ ఓవర్ బ్రిడ్జి: మంత్రి అజయ్

ABN , First Publish Date - 2020-10-02T01:31:15+05:30 IST

ప్రజల చిరకాల కోరిక రూ.74కోట్లతో నిర్మిస్తున్న దంసలాపురం బ్రిడ్జి నిర్మాణ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పరిశీలించారు.

దసరా నాటికి దంసలాపురం రోడ్ ఓవర్ బ్రిడ్జి: మంత్రి అజయ్

ఖమ్మం ప్రజల చిరకాల కోరిక రూ.74కోట్లతో నిర్మిస్తున్న దంసలాపురం  రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పరిశీలించారు. పనులు దాదాపు పూర్తి కావచ్చాయని అధికారులు వివరించారు. ఖమ్మం-బోనకల్ కు అనుసంధాన పనులను తుది దశకు చేరుకున్నాయి. మరో 15 రోజుల్లో ప్యాచి పనులు రంగులు, మొక్కలు తదితర పనులను పూర్తి చేయాలని అధికారులను మంత్రి పువ్వాడ ఆదేశించారు. ఈ దసరా నాటికి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గారి చేతుల మీదగా లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎన్నో ఎల్లనాటి కల సాకారం కానుందని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2020-10-02T01:31:15+05:30 IST