కొవిడ్ మృతులకు ఉచితంగా దహనసంస్కారం: మంత్రి పువ్వాడ

ABN , First Publish Date - 2021-05-25T17:12:35+05:30 IST

కొవిడ్ నేపథ్యంలో వైరస్ బారిన పడి మృతి చెందిన వారికి ఉచిత దహన సంస్కారం నిర్వహించాలని మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి‌కి రవాణా శాఖ మంత్రి పువ్వడ అజయ్ కుమార్ ఆదేశించారు.

కొవిడ్ మృతులకు ఉచితంగా దహనసంస్కారం: మంత్రి పువ్వాడ

ఖమ్మం: కొవిడ్ నేపథ్యంలో వైరస్ బారిన పడి మృతి చెందిన వారికి ఉచిత దహన సంస్కారం నిర్వహించాలని మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి‌కి  రవాణా శాఖ మంత్రి పువ్వడ అజయ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఖమ్మం కార్పొరేషన్‌లోని బల్లేపల్లి వైకుంఠదామం‌ను  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , మేయర్ పునుకొల్లు నీరజ సందర్శించారు. కొవిడ్ మృతుల దహన సంస్కరణల కోసం అవసరమయ్యే కర్రలు, ఇతర సామగ్రి అన్నిటినీ మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఉచితంగా అందజేయాలని తెలిపారు. మృతుల తరుపు వారి నుండి ఒక్క పైసా కూడా వసూలు చేయవద్దని మంత్రి పువ్వాడ ఆదేశించారు.

Updated Date - 2021-05-25T17:12:35+05:30 IST