రాష్ట్రంలో కమ్మకులస్తులంతా ఐక్యంగా ఉండాలి: మంత్రి పువ్వాడ

ABN , First Publish Date - 2022-04-22T20:28:23+05:30 IST

రాష్ట్రంలో కమ్మ కులస్తులందరూ ఐక్యతగా ఉండాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కమ్మకులస్తులంతా ఐక్యంగా ఉండాలి: మంత్రి పువ్వాడ

ఖమ్మం: రాష్ట్రంలో కమ్మ కులస్తులందరూ ఐక్యతగా ఉండాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ పిలుపునిచ్చారు. చిన్న విషయాలను కొందరు రాద్దాంతం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మ సామాజిక మంత్రులపై కుట్రలు పన్నుతున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తానొక్కడినే కమ్మ మంత్రినని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. కావాలనే కొంతమంది తనపై కుట్ర పన్నుతున్నారని మంత్రి అజయ్ అన్నారు. 

Updated Date - 2022-04-22T20:28:23+05:30 IST