తండ్రికి నివాళులర్పించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-08-15T10:58:53+05:30 IST

దివంగత రైతు నాయకుడు వేముల సురేందర్‌రెడ్డి నా లుగో వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆయన

తండ్రికి నివాళులర్పించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

 వేల్పూర్‌, ఆగస్టు 14: దివంగత రైతు నాయకుడు వేముల సురేందర్‌రెడ్డి నా లుగో వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సురేందర్‌రెడ్డి స్మృతివనం వద్ద మంత్రి తనతండ్రి జ్ఞాపకాలను స్మ రించుకొని భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం విలేకరులతో  మాట్లాడు తూ రైతు నాయకుడిగా ఎదిగిన సురేందర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ ఎస్‌ పార్టీ ఏర్పాటు నుంచి తెలంగాణ సాధించే వరకు సీఎం కేసీఆర్‌ వెంట నడిచారన్నారు.


సీఎం కేసీఆర్‌ రైతుల కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలపై తన తండ్రి సురేందర్‌రెడ్డి కేసీఆర్‌తో చర్చించుకున్న సందర్భాలు చాలా ఉన్నా యన్నారు. ఆయన కొడుకుగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అయన కన్న కల లు, ఆశయాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానన్నారు. ఈ సమయంలో ఆ యన లేకపోవడం బాఽధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బీమ జము న, జడ్పీటీసీ అల్లకొండ భారతి, వైస్‌ఎంఈపీ సురేష్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొట్టాల చిన్నారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు జైడి నాగాధర్‌రెడ్డి, జిల్లా ఆర్టీఏ కమిటీ సభ్యుడు రేగుల్ల రాములు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-15T10:58:53+05:30 IST