మాటా..మంత్రీ..

ABN , First Publish Date - 2022-01-24T06:20:25+05:30 IST

మాటా..మంత్రీ..

మాటా..మంత్రీ..
సీపీఎస్‌ రద్దు చేయాలని కోరుతూ అప్పట్లో బందరు కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి ధర్నా చేస్తున్న ఇప్పటి మంత్రి పేర్ని నాని (ఫైల్‌)

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : అధికారం రాక ముందు ఉద్యోగుల మద్దతు పొందేందుకు రాజకీయ నాయకులు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. అధికారంలోకి వచ్చాక మాత్రం రెండు నాల్కల ధోరణితో మాట మార్చేస్తుంటారు. మంత్రి పేర్ని నాని కూడా ఇదే కోవకు చెందినవారని నిరూపించుకున్నారు. సాధారణ ఎన్నికల ముందు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు ‘సీపీఎస్‌ రద్దు చేసిన వారికే మా ఓటు’ అంటూ ప్రకటించి బందరులోని కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న పేర్ని నాని ఉద్యోగులతో పాటే బైఠాయించి మద్దతు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం సీపీఎస్‌ రద్దు, మెరుగైన పీఆర్సీ కోసం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఇప్పుడు మాత్రం.. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకుల గురించి మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఎవరో ప్రోత్సహిస్తే ఆందోళనలు చేస్తున్నారని, ముఖ్యమంత్రిని తిడుతున్నారని, తిడితే ఏమోస్తుందని మాటమార్చి రాజకీయం చేస్తున్నారు.  

Updated Date - 2022-01-24T06:20:25+05:30 IST