తాగునీరందించేందుకు కార్యాచరణ

ABN , First Publish Date - 2020-06-05T09:19:34+05:30 IST

బందరు నియోజకవర్గంలో తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.

తాగునీరందించేందుకు కార్యాచరణ

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : బందరు నియోజకవర్గంలో తాగునీటి ఇబ్బందులు  తీర్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని  తెలిపారు. హెడ్‌వాటర్‌వర్క్స్‌ను గురువారం పరిశీలించి అధికారులతో సమా వేశం నిర్వహించారు.  తాగునీటి సరఫరా, నూతన రిజర్వాయర్ల నిర్మాణం,  పైప్‌లైన్‌ల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు. రూ.25కోట్లతో 12 ప్రాంతాల్లో రిజర్వాయర్లను నిర్మాణం చేస్తామన్నారు. ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి  సమర్పించి నిధులు తెస్తానన్నారు.  కమిషనర్‌ శివరామకృష్ణ, ఎంఈ సాయిప్రసాద్‌,  వరప్రసాద్‌, పిల్లి ప్రసాద్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-05T09:19:34+05:30 IST