రోల్డుగోల్డు పరిశ్రమకు జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలి
ABN , First Publish Date - 2021-02-26T07:12:39+05:30 IST
రోల్డుగోల్డు వస్తువుల తయారీలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు రావాలని రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు.
మచిలీపట్నం టౌన్, ఫిబ్రవరి 25 : రోల్డుగోల్డు వస్తువుల తయారీలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు రావాలని రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. జ్యూయలరీ పార్కులో స్కిల్ డెవల్పమెంట్ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందిన కార్మికులకు మంత్రి పేర్ని నాని సర్టిఫికెట్లు అందజేశారు. జ్యూయలరీ పార్క్ అభివృద్ధి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్దాదా, డ్వామా పీడీ జి.వి. సూర్యనారాయణ, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తమ్మాజీ రావు, జ్యూయలరీ పార్కు ఎండీ పంచపర్వాల సత్యనారాయణ, పి.వి.సుబ్బారావు, చలమలశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు రూ. 60 లక్షలతో నిర్మించే కమర్షియల్ కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు.