విద్యుత్రంగాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి
ABN , First Publish Date - 2022-05-18T02:47:22+05:30 IST
విద్యుత్రంగాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఏపీ ట్రాన్స్కో, విజిలెన్స్ అధికారులతో..
అమరావతి: విద్యుత్రంగాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఏపీ ట్రాన్స్కో, విజిలెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన విద్యుత్రంగంలో అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. విద్యుత్ చౌర్యం, అనధికారిక వినియోగాన్ని నియంత్రించాలని చెప్పారు. వ్యవసాయ మీటర్లపై ప్రతిపక్షాలది అనవసరపు రాద్ధాంతమని కొట్టిపారేశారు. మీటర్లతో రైతుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.