దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు: పెద్దిరెడ్డి

ABN , First Publish Date - 2021-04-17T19:35:57+05:30 IST

దొంగ ఓట్ల పేరుతో తెలుగుదేశం డ్రామాలు ఆడుతోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు: పెద్దిరెడ్డి

తిరుపతి:  దొంగ ఓట్ల పేరుతో తెలుగుదేశం డ్రామాలు ఆడుతోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతో ప్లాన్‌ ప్రకారమే ఆరోపణలు చేస్తున్నారని పెద్దిరెడ్డి చెప్పారు. తిరుపతి పుణ్యక్షేత్రం.. చాలా ప్రైవేటు బస్సులు వస్తుంటాయన్నారు. బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ కుట్రలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోనని టీడీపీ నాయకులను హెచ్చరించారు. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందన్నారు. ప్రజల్లో బలంలేక టీడీపీ నాటకాలు ఆడుతోందన్నారు.  తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి ప్రజలే బుద్ధి చెబుతారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-04-17T19:35:57+05:30 IST