255 మంది ఎంపీడీవోలకు పదోన్నతులు

ABN , First Publish Date - 2021-08-06T09:06:01+05:30 IST

రాష్ట్రంలో తొలిసారిగా 255 మంది ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు పాతికేళ్లుగా పదోన్నతులకు నోచుకోని ఎంపీడీవోలకు

255 మంది ఎంపీడీవోలకు పదోన్నతులు

మరో 18,500 మందికి ప్రయోజనాలు:  మంత్రి పెద్దిరెడ్డి 


అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తొలిసారిగా 255 మంది ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు పాతికేళ్లుగా పదోన్నతులకు నోచుకోని ఎంపీడీవోలకు ఇప్పుడు పదోన్నతులివ్వడం ద్వారా పంచాయతీరాజ్‌శాఖలోని 12 క్యాడర్లలో 18,500 మంది ఉద్యోగులకు పదోన్నతులు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. పదోన్నతుల విషయంలో సీఎం సానుకూలంగా స్పందించి, నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం సచివాలయంలో మీడియాకు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్వహించబోయే ‘ప్రొబేషనరీ పరీక్ష’పై అపోహలు వద్దని, ఈ పరీక్ష వల్ల ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తబోవని మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స తెలిపారు. విజయవాడలో గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులతో మంత్రులు సమావేశమయ్యారు. 

Updated Date - 2021-08-06T09:06:01+05:30 IST