చంద్రబాబుకు ఇవి ఆఖరి ఎన్నికలు: మంత్రి Peddireddy
ABN , First Publish Date - 2022-05-31T17:48:15+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఇవి ఆఖరి ఎన్నికలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యాలు చేశారు.
చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu)కి ఇవి ఆఖరి ఎన్నికలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy ramachandra reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల ప్రచార లబ్ధి కోసమే కుప్పంలో గ్రానైట్ తవ్వకాలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కుప్పంలో అక్రమ గ్రానైట్ తవ్వకాలపై విచారణకు ఆదేశించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.