తిరుపతి పద్మావతి నిలయంలో మాత్రమే కోవిడ్ సెంటర్: మంత్రి పెద్దిరెడ్డి

ABN , First Publish Date - 2020-10-29T21:38:31+05:30 IST

కేసుల తీవ్రత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న టీటీడీ సత్రాల్లోని ఐదు కోవిడ్ కేర్ కేంద్రాలను మూసివేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

తిరుపతి పద్మావతి నిలయంలో మాత్రమే కోవిడ్ సెంటర్: మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి: కరోనా కేసుల తీవ్రత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న టీటీడీ సత్రాల్లోని ఐదు కోవిడ్ కేర్ కేంద్రాలను మూసివేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. తిరుపతిలోని పద్మావతి నిలయం ఒక్కదానిలో మాత్రమే కోవిడ్ కేర్ కేంద్రాన్ని నిర్వహిస్తామని చెప్పారు. మరో 10 రోజులు చూసి కేసులు తగ్గితే తిరుపతి రుయా ఆసుపత్రిని సాధారణ చికిత్సలకే పరిమితం చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-29T21:38:31+05:30 IST