తెలంగాణ నేతలను క్షమించడానికి రాహుల్ ఎవరు?: మంత్రి Niranjan

ABN , First Publish Date - 2022-05-07T16:22:19+05:30 IST

రాహుల్ గాంధీ ఎవరు తెలంగాణ నాయకులను క్షమించడానికి అని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ నేతలను క్షమించడానికి రాహుల్ ఎవరు?: మంత్రి Niranjan

హైదరాబాద్: రాహుల్ గాంధీ ఎవరు తెలంగాణ నాయకులను క్షమించడానికి అని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లే బీజేపీలో చేరుతున్నారన్నారు. రెండు పర్యాయాలు క్షమించకనే ఓడగొట్టారని అన్నారు. ఈ ఎనిమిదేళ్లలో ప్రజలకు చేయాల్సింది తాము చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘‘మీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు ఉన్నాయా?’’ అని ప్రశ్నించారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని ఈడ్చితన్నారన్నారు. తెలంగాణలో పరిపాలన సవ్యంగా సాగుతోందని తెలిపారు. రైతులకు సంక్షేమం సక్రమంగా జరుగుతోందన్నారు. రాహుల్ ఇక్కడ రైతు డిక్లరేషన్ ఏం చేస్తారని మంత్రి నిలదీశారు. జాతీయ నాయకులు ఎవరో ఎవరో వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. తమరు చెప్పేవి అన్ని మోసాలే, అబద్దాలే అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలియదని, ఏదో గంభీరంగా మాట్లాడితే ప్రజలు నమ్మరని చెప్పుకొచ్చారు. 60 ఏళ్ల కాంగ్రెస్ మోసాన్ని చీల్చి తెలంగాణ సాధించుకున్నామన్నారు. పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో స్వరాష్ట్రం సిద్ధించిందని అన్నారు. నిన్న మొన్న  కాంగ్రెస్‌ను అమ్మానాభూతులు తిట్టిన వాళ్లే ఇవాళ పార్టీ సారథులుగా ఉన్నారని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

Read more