మూడు నల్ల చట్టాలకు కారణమే కాంగ్రెస్: మంత్రి నిరంజన్

ABN , First Publish Date - 2021-11-13T17:51:48+05:30 IST

మూడు నల్ల చట్టాలకు కారణమే కాంగ్రెస్ అని.... దాన్ని ఇప్పుడు మోడీ అమలు చేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

మూడు నల్ల చట్టాలకు కారణమే కాంగ్రెస్: మంత్రి నిరంజన్

హైదరాబాద్: మూడు నల్ల చట్టాలకు కారణమే కాంగ్రెస్ అని.... దాన్ని ఇప్పుడు మోడీ అమలు చేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖర్మ కాలి అది ఇప్పుడు మోడీ మెడకు చుట్టుకుందని తెలిపారు. చట్టాలకు  కాంగ్రెస్ పార్టీనే ఆద్యులని బీజేపీ ఎదురు దాడి చేయొచ్చన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తుచేశారు. బీజేపీ నేతలకు అధ్యయనం చేసే తెలివి లేదని విమర్శించారు. తిరుపతిలో జరిగే అమిత్ షా సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరో ఒక ప్రతినిధి హాజరవుతారన్నారు. అక్కడకు వెళ్లి నిలదీయడానికి ఆయన వ్యవసాయ మంత్రి కాదని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-13T17:51:48+05:30 IST