రానున్నది ఆయిల్ఫామ్ రోజులే: మంత్రి నిరంజన్
ABN , First Publish Date - 2022-05-02T17:02:25+05:30 IST
జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్లో ఆయిల్ ఫామ్ క్షేత్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం ఉదయం పర్యవేక్షించారు.
నిజామాబాద్: జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్లో ఆయిల్ ఫామ్ క్షేత్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం ఉదయం పర్యవేక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... రానున్నది ఆయిల్ఫామ్ రోజులే అని.. వరి పంటతో పోలిస్తే ఆయిల్ ఫామ్తో రైతులకు ఎన్నో లాభాలు ఉంటాయని తెలిపారు. ఆయిల్ ఫామ్ దిశగా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందని చెప్పారు. అవగాహన సదస్సులతో పాటు ప్రభుత్వం అందించే సబ్సీడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచనలు చేశారు.