పీయూష్ గోయల్ పార్లమెంట్‌లో అందంగా అబద్ధం చెప్పారు: మంత్రి నిరంజన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-12-18T00:36:03+05:30 IST

పీయూష్ గోయల్ పార్లమెంట్లో అందంగా అబద్ధం చెప్పారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

పీయూష్ గోయల్ పార్లమెంట్‌లో అందంగా అబద్ధం చెప్పారు: మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్: పీయూష్ గోయల్ పార్లమెంట్‌లో అందంగా అబద్ధం చెప్పారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఈరోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానంపై సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం వైఖరీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ సూచించారన్నారు. ఆరుగురు మంత్రుల బృందం పార్లమెంట్ సభ్యుల బృందంతో రేపు ఢిల్లీ వెళ్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి రైతుల సమస్యలు తీసుకెళ్తామన్నారు. 20వ తేదీన అన్ని గ్రామాల్లో ఊరేగింపు, శవడప్పు కార్యక్రమాలు ఉంటాయన్నారు. రైతుబంధు కట్ చేసేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారన్నారు. అధికారులు ఇచ్చిన నివేదికను కేసీఆర్ ఒప్పుకోలేదని మంత్రి నిరంజన్‌రెడ్డి మీడియాకు తెలిపారు.

Updated Date - 2021-12-18T00:36:03+05:30 IST