సీడ్ పాయింట్‌గా గజ్వెల్ అభివృద్ధి చెందుతోంది : Niranjan Reddy

ABN , First Publish Date - 2022-06-27T18:39:06+05:30 IST

ప్రజల ఊహలకు అందనిది, కలలో కూడా ఉహించని అభివృద్ధి టీఆర్ఎస్(TRS) హయాంలో జరుగుతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) పేర్కొన్నారు.

సీడ్ పాయింట్‌గా గజ్వెల్ అభివృద్ధి చెందుతోంది : Niranjan Reddy

Siddipet : ప్రజల ఊహలకు అందనిది, కలలో కూడా ఉహించని అభివృద్ధి టీఆర్ఎస్(TRS) హయాంలో జరుగుతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) పేర్కొన్నారు. గజ్వేల్ రైల్వే స్టేషన్‌(Gajwel Railway station)లో ఎరువుల రేక్ పాయింట్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనేక రకాల ఎగుమతుల సౌలభ్యం ఈ రేక్ పాయింట్ ద్వారా అందనుందన్నారు. రాబోయే వందల సంవత్సరాల వరకూ ప్రజల అవసరాలు తీర్చే పనులు జరుగుతున్నాయన్నారు. సీడ్ పాయింట్‌గా గజ్వెల్ అభివృద్ధి చెందుతున్నదని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు(National Parties) దేశాన్ని ఎన్ని ఏళ్ళు ఏలినా తెలంగాణకు ఒరిగిందేమి లేదన్నారు. ఈ రోజు కేంద్రాన్ని ఏలుతున్న పార్టీ వరి సాగులో, వడ్ల కొనుగోలులో అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిందని విమర్శించారు. వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుకు రైతులు మొగ్గు చూపాలన్నారు.

రైతులకు, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.


Updated Date - 2022-06-27T18:39:06+05:30 IST