ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం ఇస్తున్నాం: మంత్రి నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-03-14T21:15:39+05:30 IST

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం ఇస్తున్నాం: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. సోమవారం శాసనసభలో సభ్యులు బాల్క సుమన్, సండ్ర వెంకటవీరయ్య , అంజయ్య యాదవ్, గండ్ర వెంకటరమణా రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం చెప్పారు.పంటల మార్పిడిలో విధానంలో భాగంగా ఆయిల్ పామ్ ను ప్రోత్సహిస్తున్నట్టుఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 26 జిల్లాలలో ఆయిల్ పామ్ పంటను విస్తరించడానికి 11 కంపెనీలకు ఫ్యాక్టరీ జోన్లను కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంననుసరించి, తమకు కేటాయించిన ఫ్యాక్టరీ జోన్లలో రైతులకు సరఫరా చేయడం కోసం ఆయిల్ పామ్ విత్తనాలను పెంచడానికి కేటాయించిన కంపెనీ నర్సరీలను ఏర్పాటు చేయాలి, ప్రతీ సంవత్సరం 2.25 కోట్ల పిలక మొక్కలను పెంచడానికి రాష్ట్రమంతటా కంపెనీలు ఇప్పటి వరకు 29 నర్సరీలను ఏర్పాటు చేశాయి.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, అప్పారావు పేటల వద్ద ప్రతి ఒక్క గంటకు 30 ఎంటీల సామర్థ్యంతో టీఎస్ ఆయిల్ ఫెడ్ రెండు ప్రాసెసింగ్ యూనిట్లను నడుపుతున్నదని మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం, కేటాయించిన జిల్లాలో మొదటిసారి మొక్కలు నాటిన 36 నెలలలోపు ఫ్యాక్టరీ జోనులో పూర్తిస్థాయి నిర్వహణ ప్రాసెసింగ్ యూనిట్ ని కేటాయించిన కంపెనీలు అవసరం మేరకు ఎప్పటికప్పుడు సిపిఓ యూనిట్, రిఫైనరీల సామర్థ్యాన్ని పెంచుతాయన్నారు.ఆయిల్ పామ్ సాగుపై ఉద్యానశాఖ ద్వారా పెద్ద ఎత్తున రైతులను చైతన్యం చేస్తున్నాం.. ఇప్పటికే 79 క్షేత్ర పర్యటనల ద్వారా 8460 మంది రైతులకు ఆయిల్ పామ్ సాగు ఇతర విషయాలపై అవగాహన కల్పించినట్టు మంత్రి వివరించారు.వరి మినహా మిగతా పంటలన్నీ ఆయిల్ పామ్ తోటలలో అంతర పంటలుగా సాగుచేయొచ్చన్నారు. ఆయిల్ పామ్ మొక్కల పెంపకం 14 నుండి 16 నెలల ప్రక్రియ... కోస్టారికా, మలేషియా, థాయింలాండ్ దేశాల నుండి దిగుమతి చేసుకుని నర్సరీలు ఏర్పాటు చేశామని తెలిపారు.2.50 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు అందించేందుకు సన్నద్దమవుతున్నామన్నారు.


ప్రస్తుతం రాష్ట్రంలో ఆయిల్ ఫెడ్ కి చెందిన రెండు ఆయిల్ పామ్ ఫాక్టరీలు, ఒక్కొకటి 30 మెట్రిక్ టన్నలు సామర్థ్యంతో (కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట లో ఒకటి మరియు అప్పారావు పేట లో ఒకటి) నిర్వహణలో వున్నవి. ప్రభుత్వం, కంపెనీ ల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఆయా జిల్లాకు నిర్దేశించబడిన కంపెనీ తమ ఫ్యాక్టరీ జోన్ నందు ఆయిల్ పామ్ తోటను నాటిన 36 నెలలలో మిల్లులను ఏర్పాటుచేయవలసి వుంటుంది. అవసరాన్ని బట్టి సమయానుకూలంగా ఈ మిల్లుల సామర్థ్యం పెంచవలసివుంటుందన్నారు.ఆయిల్ పామ్ మొక్కల కొరకు ఎకరానికి రూ.11,600/-, ఎరువులు మరియు అంతర పంటల కోసం) సంవత్సరానికి ఎకరానికి రూ.4200/- (4 సంవత్సరాల వరకు ) రాయితీ అందించబడుతుంది. ఎకరానికి రూ.20317/- చొప్పున బిందు సేద్యానికి రాయితీ కల్పించనున్నట్టు మంత్రి తెలిపారు.


Updated Date - 2022-03-14T21:15:39+05:30 IST