ప్రకృతిని కాపాడుకుందాం:అది మనను కాపాడుతుంది: నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2021-08-23T21:07:03+05:30 IST

ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని కాపాడాలని వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

ప్రకృతిని కాపాడుకుందాం:అది మనను కాపాడుతుంది: నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని కాపాడాలని వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మానవాళి ఆలోచనా తీరు మారాలని, ప్రకృతిని, ప్రకృతిలోని జీవరాశులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని పేర్కొన్నారు. సోమవారం నగరంలోని నెక్లెస్ రోడ్లో నిర్వహిస్తున్న నర్సరీ మేళాకు మంత్రి హాజరయ్యారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లు, మొక్కల పెంపకం మీద ప్రజల ఆలోచన తీరు క్రమంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం శాతం పెరిగింది.మ్యాన్ మేడ్ ఫారెస్టుల నిర్మాణంలో మనం ముందున్నామని, భావితరాలకు మనం అందించే గొప్ప సంపద ఇదేనని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉద్యానవనశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-08-23T21:07:03+05:30 IST