విశాఖ అభివృద్ధికి సీఎం జగన్ కృషి: అవంతి

ABN , First Publish Date - 2021-02-27T21:20:19+05:30 IST

పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో వస్తాయిని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

విశాఖ అభివృద్ధికి సీఎం జగన్ కృషి: అవంతి

విశాఖ: పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో వస్తాయిని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మంత్రి అవంతి, ఎంపీ విజయసాయిరెడ్డి, కే కే రాజు, వైసీపీ నేతలు భారీగా పాల్గొన్నారు.  ఈసందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. విశాఖ నగరం అభివృద్ధికి సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. విశాఖ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కరోనా సమయంలో ఇళ్లలో ఉన్న టీడీపీ నేతలు ఈరోజు ఓట్ల కోసం వస్తున్నారని ఎద్దేవా చేశారు. జీవీఎంసీలో వైసీపీని గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కుప్పం‌లో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడిన బాష తీరు సరిగా లేదని మార్చుకోవాలని ముత్తంశెట్టి శ్రీనివాసరావు హితువు పలికారు. 

Updated Date - 2021-02-27T21:20:19+05:30 IST