కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో మంత్రి మేకపాటి భేటీ

ABN , First Publish Date - 2021-11-12T17:02:13+05:30 IST

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో మంత్రి మేకపాటి భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యాటకాభివృద్ధిపై కేంద్ర మంత్రికి మంత్రి మేకపాటి ప్రతిపాదనలను సమర్పించారు. సోమశిల ప్రాజెక్టు పరిసరాలు సహా అనంతసాగరం, సంగం మండలాల్లో పర్యాటక ప్రదేశాలుగా మార్చే అవకాశంగల ప్రాంతాల గురించి మంత్రి వివరించారు. సోమశిల ప్రాజెక్టు సమీపంలో పురాతన కట్టడాలు, ప్రాచీన చరిత్ర కలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దాలని వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా పరిధిలో గల పర్యాటక ప్రదేశాలపై కేంద్ర మంత్రి ఆరా తీశారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి నెల్లూరు జిల్లాలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర మంత్రికి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-11-12T17:02:13+05:30 IST