మంత్రి మల్లారెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2021-07-31T05:00:18+05:30 IST

మంత్రి మల్లారెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

మంత్రి మల్లారెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం
మంత్రి మల్లారెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న దివ్యాంగులు

ఘట్‌కేసర్‌:  మంత్రి కేటీఆర్‌ జన్మదిన సందర్భంగా మేడ్చల్‌ నియోజకవర్గంలోని 50మంది దివ్యాంగులకు గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో పథకంలో భాగంగా మోటార్‌ బైకులు ఇస్తానని మంత్రి మల్లారెడ్డి ప్రకటించడం హర్షణీయమని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు మొక్క ఉపేందర్‌ అన్నారు. శుక్రవారం మంత్రి మల్లారెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో లింగమల్లు, బాలనర్సయ్య, సాలమ్మ, శోభ, నిర్మల, సంజీవ, సంతోషి పాల్గొన్నారు. 

నేడు పోచారం, ఘట్‌కేసర్‌కు మల్లారెడ్డి రాక

నేడు ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి మల్లారెడ్డి వస్తున్నట్లు మున్సిపల్‌చైర్మన్‌ కొండల్‌రెడ్డి శక్రవారం పేర్కొన్నారు.

Updated Date - 2021-07-31T05:00:18+05:30 IST