బీజేపీ ఆ పని చేస్తే.. నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా : మల్లారెడ్డి
ABN , First Publish Date - 2022-05-27T20:10:00+05:30 IST
బీజేపీ అంటేనే జూటా పార్టీ అని మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు.
హన్మకొండ : బీజేపీ(BJP) అంటేనే జూటా పార్టీ అని మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) మండిపడ్డారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. ఆ సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఆయన సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు అమలు చేస్తే.. తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మల్లారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణను బీట్ చేసే మగాడు ఎవరూ లేరని మల్లారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్(KCR)కు ప్రజలు సంపూర్ణ మద్దతివ్వాలన్నారు. బీజేపీ కౌరవుల నుంచి దేశానికి విముక్తి కల్పించాలని.. కేసీఆర్ను ప్రధాని(Prime Minister)ని చేయాలని భద్రకాళిని ప్రార్థించానన్నారు. దసరా రోజు భద్రకాళిని కేసీఆర్ దర్శించుకుంటారని.. అమ్మవారిని మొక్కి దేశ రాజకీయాల కోసం బయల్దేరుతారన్నారు. కేసీఆర్ దేశ్కీ నేత అని.. ప్రధాని కావాలని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.