కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణలో పనిలేదు: మంత్రి Malla reddy

ABN , First Publish Date - 2022-06-17T00:22:26+05:30 IST

కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో పనిలేదని, ఈ రెండు పార్టీలు ప్రశాంతంగా ఉన్న తెలంగాణను అల్లకల్లోలం చేస్తున్నాయని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి(malla reddy) ఆరోపించారు.

కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణలో పనిలేదు: మంత్రి Malla reddy

హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో పనిలేదని, ఈ రెండు పార్టీలు ప్రశాంతంగా ఉన్న తెలంగాణను అల్లకల్లోలం చేస్తున్నాయని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి(malla reddy) ఆరోపించారు. ఈడీ నోటీసు వస్తే ఢిల్లీలో ఆందోళన చేయాలి కానీ ఇక్కడ ఆందోళనలు దేనికని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ కాలర్‌ ఎలా పట్టుకుంటారని ప్రశ్నించారు.శాంతిభద్రతల పరిరక్షణకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకోమన్నారు. జాతీయ పార్టీపై కేసీఆర్‌కు పూర్తి స్పష్టత ఉందని ఈ సందర్భంగా మల్లారెడ్డి స్పష్టం చేశారు.రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ ఐరన్‌ లెగ్‌లు అని ఆయన వ్యాఖ్యానించారు.వాళ్లు అడుగుపెట్టిన చోట వర్షాలు పడవని అన్నారు. 

Updated Date - 2022-06-17T00:22:26+05:30 IST