ఆ చిన్నారులను ఆదుకోండి

ABN , First Publish Date - 2020-10-30T11:26:24+05:30 IST

తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరైన నిడమనూరు మండలం బంకాపురం గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్ల దీనస్థితిపై మంత్రి కేటీఆర్‌ చలించారు.

ఆ చిన్నారులను ఆదుకోండి

 కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

 తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరైన బంకాపురం చిన్నారులు

 గ్రామ యువకుడి వినతికి స్పందించిన మంత్రి


నిడమనూరు, అక్టోబరు 29: తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరైన నిడమనూరు మండలం బంకాపురం గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్ల దీనస్థితిపై మంత్రి కేటీఆర్‌ చలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉప్పొంగిన బంకాపురం వాగు దాటుతూ ప్రమాదవశాత్తు అందులోపడి పెందోటి లక్ష్మమ్మ మృతిచెందింది. ఆమె మృతిని తట్టుకోలేక భర్త నర్సింహ ఉరేసుకొని బలవన్మరణం చెందాడు. రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన నిఖిత, అంజలి అనాథలయ్యారు. వీరి దీనస్థితిని గ్రామానికి చెందిన పేలపోలు ప్రణయ్‌ ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి పిల్లల సంరక్షణ బాధ్యత చేపట్టి ఆదుకోవాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ను ఆదేశించారు. 

Updated Date - 2020-10-30T11:26:24+05:30 IST