నేడు కేంద్రమంత్రి పీయూష్‌తో మంత్రి కేటీఆర్ బృందం భేటీ

ABN , First Publish Date - 2021-11-23T16:50:49+05:30 IST

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రి కేటీఆర్‌లోని బృందం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది.

నేడు కేంద్రమంత్రి పీయూష్‌తో మంత్రి కేటీఆర్ బృందం భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలోని బృందం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి సంవత్సరానికి ఎంత ధాన్యం?.. ఏ రూపంలో కొనుగోలు చేస్తారో? తేల్చాలని బృందం సభ్యులు కేంద్రాన్ని కోరనున్నారు. సమావేశానికి మంత్రి కేటీఆర్ వెంట టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, మంత్రులు గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు వెళ్లనున్నారు. 

Updated Date - 2021-11-23T16:50:49+05:30 IST