మంత్రి కేటీఆర్ మంచి మనసు

ABN , First Publish Date - 2021-11-18T04:07:33+05:30 IST

మంత్రి కేటీఆర్ మంచి మనసు చాటుకున్నారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి హకీంపేట బస్ డిపో వద్ద మియాపూర్‌కు చెందిన...

మంత్రి కేటీఆర్ మంచి మనసు

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ మంచి మనసు చాటుకున్నారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి హకీంపేట బస్ డిపో వద్ద  మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అదే సమయంలో మంత్రి కేటీఆర్ అటుగా వెళ్తున్నారు. చూసి చలించిపోయిన ఆయన క్షతగాత్రులను తన ఎస్కార్ట్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. 



Updated Date - 2021-11-18T04:07:33+05:30 IST