కంటోన్మెంట్ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది: KTR
ABN , First Publish Date - 2022-02-12T17:26:28+05:30 IST
కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం సనత్నగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్లో ఉచిత మంచి నీటి పథకం అమలు చేస్తున్నామన్నారు. పేదలకు పట్టాలు ఇవ్వకుండా కేంద్రం అడ్డు పడుతోందని విమర్శించారు. కొత్త రోడ్లు వేద్దామన్నా, నాలాలు డెవలప్ చేద్దామన్న కేంద్రం సహకరించడం లేదని తెలిపారు. రాజకీయ లబ్ది కోసం ప్రజల ప్రయోజనాలకు ఆటంకం కలిగించొద్దన్నారు. కలిసి వచ్చి కంటోన్మెంట్ అభివృద్ధికి సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు.