విశ్వబ్రాహ్మణులకు మంత్రి కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలి

ABN , First Publish Date - 2022-07-02T05:30:00+05:30 IST

విశ్వబ్రాహ్మణులకు మంత్రి కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలి

విశ్వబ్రాహ్మణులకు మంత్రి కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలి
మంత్రి కేటీఆర్‌ చిత్రపటాన్ని దహనం చేసేందుకు యత్నిస్తున్న విశ్వబ్రాహ్మణులు

పరిగి, జూలై 2 : ఐటీ మంత్రి కేటీఆర్‌ విశ్వబ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని, విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు పాండురంగాచారి, మండలాధ్యక్షుడు ఎంకన్నచారి, స్వర్ణకారుల సంఘం అఽధ్యక్షుడు అశోక్‌చారి, గౌరవాధ్యక్షుడు గోపాల్‌చారిలు అన్నారు. కల్వకుర్తిలో జరిగిన సభలో మంత్రి కేటీఆర్‌ విశ్వబ్రాహ్మణుల గురించి చేసిన వాఖ్యలను నిరసిస్తూ శనివారం సాయంత్రం పరిగిలో నిరసన వ్యక్తం చేశారు. మంత్రి చిత్రపటంతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ వద్ద కేటీఆర్‌ చిత్రపటాన్ని దహనం చేసేందుకు యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. విశ్వబ్రాహ్మణుల సంఘం నాయకులు వినోద్‌చారి, వీరాచారి, కృష్ణచారి, బ్రహ్మాచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T05:30:00+05:30 IST