రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ సెటైర్లు
ABN , First Publish Date - 2022-05-07T18:06:20+05:30 IST
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీపై మంత్రి కేటీఆర్ సెటైర్లు విసిరారు. కొందరు టూరిస్ట్లు వస్తారు..పోతారు అంటూ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ సెటైర్లు విసిరారు. కొందరు టూరిస్ట్లు వస్తారు.. పోతారు అంటూ వ్యాఖ్యలు చేశారు. వరంగల్ సభలో రాహుల్ ఏదేదో మాట్లాడారన్నారు. రాహుల్కు ఏదో రాసిచ్చారు.. చదివాడు పాపం అంటూ యెద్దేవా చేశారు. రాహుల్కు వడ్లు తెలియదు.. ఎడ్లు తెలియదంటూ సెటైర్లు వేశారు. హైదరాబాద్లో ధమ్ బిర్యానీ తింటారు.. వెళ్లిపోతారన్నారు. మోదీ పాలనలో సిలిండర్ ధర వెయ్యి దాటిందని మంత్రి మండిపడ్డారు. ఎంతమంది వచ్చివెళ్లినా పనిచేసే నేతలు మాత్రమే కావాలన్నారు. ఎవరో చెప్పిన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణలో ప్రతిగ్రామం అభివృద్ధిలో దూసుకెళ్తోందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు సమస్యలపై చర్చకు సిద్ధమా? అని నిలదీశారు. ఈ విషయంపై రైతుల దగ్గరకే వెళ్లి చర్చిద్దాం అంటూ రాహుల్కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.