కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

ABN , First Publish Date - 2022-04-06T23:20:07+05:30 IST

పెట్రో ధరల పెంపుపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ

కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

హైదరాబాద: పెట్రో ధరల పెంపుపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అని చెప్పుకునే మోదీ పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయిందని ఆయన ఆ లేఖలో విమర్శించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలతో సంబంధంలేకుండా దేశంలో పెట్రో ధరలను పెంచుతూనే ఉన్నారని ఆయన ఆరోపించారు. పన్నులు పెంచడమే పరిపాలనగా భ్రమిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒక్కో కుటుంబం నుంచి రూ.లక్ష పెట్రో పన్నును కేంద్రం దోచుకుందని ఆయన పేర్కొన్నారు. అచ్చేదిన్ కాదు.. అందర్నీ ముంచే దిన్ అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ ఆ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-06T23:20:07+05:30 IST