హైదరాబాద్: మ్యూజికల్ ఫౌంటెన్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ABN , First Publish Date - 2022-04-19T16:28:51+05:30 IST

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ మంగళవారం పాతబస్తీలో పర్యటిస్తున్నారు.

హైదరాబాద్: మ్యూజికల్ ఫౌంటెన్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ మంగళవారం పాతబస్తీలో పర్యటిస్తున్నారు. రూ.495.75 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ. 2.55 కోట్లతో ఏర్పాటు చేసిన మీర్ ఆలం చెరువు వద్ద మ్యూజికల్ ఫౌంటెన్‌ను ప్రారంభించారు. అలాగే కాలాపత్తర్ పోలీస్ స్టేషన్‌కు శంకుస్థాపన, రూ. 108 కోట్లతో జీహెచ్ఎంసీ నిర్మించిన బహదూర్ పుర ఫ్లైఓవర్‌‌ను ప్రారంభించనున్నారు. రూ. 36 కోట్లతో  జీహెచ్ఎంసీ చేపట్టిన ముర్గి చౌక్  పునర్మిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రూ. 21.9 కోట్లతో చేపట్టిన మీరాలం మండి పునర్నిర్మాణం, చార్మినార్ ఏరియాలో రూ. 30 కోట్లతో జీహెచ్ఎంసీ చేపట్టిన సర్దార్ మహాల్ రీస్టోరేషన్ అండ్ డెవలప్ మెంట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత కార్వాన్ నియోజకవర్గంలో రూ. 297.30 కోట్లతో జలమండలి చేపట్టిన సీవరేజ్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-19T16:28:51+05:30 IST