కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి కేటీఆర్ లేఖ

ABN , First Publish Date - 2022-04-17T01:47:50+05:30 IST

కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి కేటీఆర్ శనివారం లేఖ రాశారు.

కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి కేటీఆర్ లేఖ

హైదరాబాద్:  కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి కేటీఆర్ శనివారం లేఖ రాశారు. ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ కార్యాచరణపై లేఖలో వెల్లడించారు. తెలంగాణకు ఎస్టీపీఐలను కేటాయించాలని కోరారు. ఐటీ రంగంలో ప్రగతి సాధిస్తున్న తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు.సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్‌ల ఏర్పాటులో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. కేంద్ర సర్కార్ నిర్ణయంతో రాష్ట్ర యువత ఉపాధి అవకాశాలకు విఘాతం కలుగుతోందన్నారు. ఇప్పటికే ఐటీఐఆర్‌ రద్దుతో యువత, ఐటీ రంగానికి అన్యాయం జరుగుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-04-17T01:47:50+05:30 IST