గౌతమ్ రెడ్డి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండ: మంత్రి KTR
ABN , First Publish Date - 2022-02-21T18:34:09+05:30 IST
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్లోని మేకపాటి నివాసానికి చేరుకున్న మంత్రి కేటీఆర్... గౌతమ్ రెడ్డి పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... గౌతమ్రెడ్డి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గౌతమ్రెడ్డితో తనకు 12 ఏళ్లుగా పరిచయం ఉందని అన్నారు. గౌతమ్రెడ్డి ఉజ్వల భవిష్యత్ ఉన్న నాయకుడని మంత్రి కేటీఆర్ తెలిపారు.