వాహ్… ఏం పథకం!...ఏపీకి మాత్రమేనా లేక.. : KTR

ABN , First Publish Date - 2021-12-29T18:50:54+05:30 IST

ఏపీలో అధికారంలోకి వచ్చాక తక్కువ ధరకే చీఫ్ లిక్కర్‌ను సరఫరా చేస్తామంటూ విజయవాడలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో ఏపీ బీజేపీ నేత సోమువీర్రాజు చేసి వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

వాహ్… ఏం పథకం!...ఏపీకి మాత్రమేనా లేక.. : KTR

హైదరాబాద్: ఏపీలో అధికారంలోకి వచ్చాక తక్కువ ధరకే చీఫ్ లిక్కర్‌ను సరఫరా చేస్తామంటూ విజయవాడలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో ఏపీ బీజేపీ నేత సోమువీర్రాజు చేసి వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సోమువీర్రాజు వ్యాఖ్యలపై ఇతర పార్టీల నేతలు సెటైర్లు విసురుతున్నారు. తాజాగా మద్యం విషయంలో సోము చేసిన కామెంట్లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘వాహ్… ఏమి పథకం!... ఎంత అవమానకరం.. ఏపీ బీజేపీ కొత్త పతనానికి దిగజారింది.. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనే బీజేపీ జాతీయ విధానం ఏపీ కా... లేదా నిరాశ "అధికంగా" ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ ఉందా?’’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 

Updated Date - 2021-12-29T18:50:54+05:30 IST