మున్సిపల్చైర్పర్సన్ ను అభినందించిన మంత్రి కేటీఆర్
ABN , First Publish Date - 2022-10-05T04:31:35+05:30 IST
స్వచ్ఛసర్వేక్షణ్-2022లో భాగంగా బెస్ట్ సిటిజన్స్ ఫీడ్బ్యాక్ అవార్డును అందుకున్న హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, కమిషనర్ రాజమల్లయ్యను మంగళవారం మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో సన్మానించారు
హుస్నాబాద్ మున్సిపాలిటీకి రూ. 2 కోట్లు మంజూరు
హుస్నాబాద్, అక్టోబరు 4: స్వచ్ఛసర్వేక్షణ్-2022లో భాగంగా బెస్ట్ సిటిజన్స్ ఫీడ్బ్యాక్ అవార్డును అందుకున్న హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, కమిషనర్ రాజమల్లయ్యను మంగళవారం మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో సన్మానించారు. 2 సార్లు అవార్డు అందుకున్న హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.2కోట్లు మంజూరైనట్లు ఆమె తెలిపారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పట్టణ ప్రగతి నిధుల ద్వారా పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నామని ఈ సందర్భంగా రజిత పేర్కొన్నారు. అవార్డు అందుకున్న పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి నగదును అందించలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ అయిలేని అనిత, ఎన్విరాల్మెంట్ ఇంజనీర్ రవికుమార్ పాల్గొన్నారు.