తెలంగాణ అభివృద్ధిని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూపిస్తారా: కేటీఆర్
ABN , First Publish Date - 2022-02-04T22:34:01+05:30 IST
తెలంగాణ పల్లెల తరహా అభివృద్ధిని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూపిస్తారా అని
మహబూబ్నగర్: తెలంగాణ పల్లెల తరహా అభివృద్ధిని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూపిస్తారా అని బీజేపీ నాయకులకు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. జడ్చర్ల మండలం కోడ్గల్లో రైతు వేదిక, 40 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే దుందుభి నదిపై చెక్డ్యామ్లు కట్టిస్తామన్నారు. కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని ఆయన తెలిపారు. మిషన్ భగీరథ వల్ల ఇక ఫ్లొరోసిస్ రాదని స్వయంగా కేంద్రమంత్రే అన్నారని ఆయన పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే ఉలుకూ పలుకూ లేదని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం కలిసొచ్చినా, రాకున్నా అభివృద్ధిలో వెనకడుగు వేయబోమని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.