నవంబరు మొదటివారంలో టీఆర్ఎస్ ప్లీనరీ: కేటీఆర్

ABN , First Publish Date - 2021-08-24T23:29:17+05:30 IST

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం నవంబరు మొదటి వారంలలో ఉంటుందని మంత్రి కేటీఆర్

నవంబరు మొదటివారంలో టీఆర్ఎస్ ప్లీనరీ: కేటీఆర్

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం నవంబరు మొదటి వారంలో ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబరు 2న గ్రామ, వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే కొత్తగా జిల్లా అధ్యక్షులను నియమిస్తామన్నారు. రెండు దశాబ్దాల చరిత్రలో టీఆర్ఎస్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిందన్నారు. హైదరాబాద్, వరంగల్ మినహా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలను దసరా రోజున ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.


ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ భవనానికి సెప్టెంబర్ 2న భూమి పూజ ఉంటుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. మండల, పట్టణ, వార్డు మున్సిపల్, జిల్లా కమిటీలను కూడా సెప్టెంబర్‌లోనే పూర్తి చేస్తామన్నారు. నవంబర్‌లో టీఆర్ఎస్ ద్వి దశాబ్ది వార్షికోత్సవ సభ ఉంటుందని కేటీఆర్‌ తెలిపారు. 



Updated Date - 2021-08-24T23:29:17+05:30 IST