కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

ABN , First Publish Date - 2021-06-15T22:20:00+05:30 IST

గత ఏడాది గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో అమరుడైన తెలుగు బిడ్డ కల్నల్ సంతోష్ బాబు కాంస్య

కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

సూర్యాపేట: గత ఏడాది గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో అమరుడైన తెలుగు బిడ్డ కల్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని పట్టణంలో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. సంతోష్ బాబు కాంస్య విగ్రహానికి మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి పూలమాలలు వేసారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గతేడాది హాకీంపేట నుంచి సూర్యాపేట వరకు కల్నల్ సంతోష్ బాబుకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారన్నారు. 

సంతోష్ బాబు విగ్రహాన్ని రూపొందించిన జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్ బోళ్ల శ్రీనివాస్ రెడ్డిని మంత్రి అభినందించారు. భారత సైన్యంలో పనిచేసే ప్రతి కుంటుబానికి, ప్రజలకు స్ఫూర్తి నిచ్చేలా సీఎం కేసీఆర్ ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ నల్గొండ జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-15T22:20:00+05:30 IST