గ్రామీణాభివృద్ధి లో పల్లె ప్రగతి కొత్త శకానికి నాంది: కేటీఆర్

ABN , First Publish Date - 2022-01-03T22:31:14+05:30 IST

దేశంలోని గ్రామీణాభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమం ఒక కొత్త శకానికి నాంది అని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కె తారక రామారావు అన్నారు.

గ్రామీణాభివృద్ధి లో పల్లె ప్రగతి కొత్త శకానికి నాంది: కేటీఆర్

హైదరాబాద్: దేశంలోని గ్రామీణాభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమం ఒక కొత్త శకానికి నాంది అని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కె తారక రామారావు అన్నారు. సీఎం కెసీఆర్ సమర్థవంతమైన నాయకత్వం వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్నది. బహిరంగ మల విసర్జన రహిత (ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ) రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలవడం పట్ల అభినందనలు తెలిపారు. బహిరంగ మల విసర్జన రహిత (ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ) రాష్ట్రాలలో ఔత్సాహిక అభివృద్ధి మోడల్ గా తెలంగాణ ఉంది. 96.74% తో దేశంలో  తెలంగాణ నెం.1 గా ఉందటం, రెండో స్థానంలో తమిళనాడు (35.39%) భారీ తేడాతో ఉండటాన్ని కూడా కేటీఆర్ ఉంటంకించారు. 


అయితే, పల్లె ప్రగతి కార్యక్రమం పక్డ్బందిగా అమలు అవుతుండటం, ఇందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న కృషికి ప్రశంసలు కురిపించారు. అలాగే స్వచ్ఛ తెలంగాణ కోసం అహర్నిశలు పని చేస్తున్న పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, సిబ్బంది ని మంత్రి కేటీఆర్ అభినందంచారు.కాగా, ఇందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసిఆర్ దార్శనికత, మంత్రి కేటీఆర్ గైడెన్స్ లో తమ శాఖ మంచి ప్రగతిని సాధిస్తున్నదని మంత్రి రీ ట్వీట్ చేశారు.


Updated Date - 2022-01-03T22:31:14+05:30 IST