trs vs bjp తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు: ktr

ABN , First Publish Date - 2022-05-09T23:09:24+05:30 IST

తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(ktr) అన్నారు.

trs vs bjp తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు: ktr

నారాయణపేట: తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(ktr) అన్నారు. బిజెపి నాయకులు తెలంగాణ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.జాతీయ పార్టీ నేతలకు కేంద్రాన్ని నిలదీసే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. మోదీకి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే సుష్మాస్వరాజ్ చెప్పినట్లు పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.రాష్ట్రానికి చేసిందేమీలేదు కానీ.. సిగ్గులేకుండా పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు.తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై అమిత్‌షా సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. బిజెపి నాయులు ఉర్దూ భాషపై విషపూరిత రాజకీయాలు చేస్తున్నారు. కేంద్రం నిర్వహించే పోటీ పరీక్షల్లో ఉర్దూ ఉంటే తప్పు లేదు కానీ తెలంగాణలో ఉర్దూ ఉంటే వద్దంటున్నారని మంత్రి ఆరోపించారు. 


Read more