గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో త్రిచక్ర వాహనాలను పంపిణీ చేసిన కేటీఆర్

ABN , First Publish Date - 2021-08-08T19:55:06+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు చేనేత, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా అనేకమంది

గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో త్రిచక్ర వాహనాలను పంపిణీ చేసిన కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు చేనేత, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా అనేకమంది మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రకటించిన దివ్యాంగులకు త్రిచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమం ఆదివారం నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ చేతులమీదుగా పలువురికి ఈ త్రిచక్ర వాహనాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో భాగంగా త్రిచక్ర వాహనాలు ఇచ్చేందుకు ముందుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ  నియోజకవర్గాల్లో త్వరలో వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గాల్లో చేపడతారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తన పుట్టిన రోజు ని పురస్కరించుకొని దివ్యాంగులకు త్రి చక్ర వాహనాలను ప్రకటించిన అందరికీ కృతజ్ఞతలు, ధన్యావాదాలు తెలిపారు.తన జన్మదినోత్సవం సందర్భంగా ప్రతిసారీ ఏదో ఒక సేవా కార్యక్రమాలకు పూనుకుంటున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల పాల్గొన్నారు.

Updated Date - 2021-08-08T19:55:06+05:30 IST