పారిశ్రామిక రంగంలో దేశంలోనే తెలంగాణ ముందంజ: కేటీఆర్

ABN , First Publish Date - 2021-07-31T22:34:47+05:30 IST

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడేళ్ల కాలంలో పారిశ్రామిక రంగంలో తెలంగాణ దేశంలోనే ముందుందని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు పేర్కొన్నారు.

పారిశ్రామిక రంగంలో దేశంలోనే తెలంగాణ ముందంజ: కేటీఆర్

రంగారెడ్డి జిల్లా: తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడేళ్ల కాలంలో పారిశ్రామిక రంగంలో తెలంగాణ దేశంలోనే ముందుందని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు పేర్కొన్నారు. సమర్ధవంతమైన నాయకత్వం, సుస్థిరత కూడిన ప్రభుత్వం ఈ రెండు ఉన్నప్పుడే అభివ`ద్ధి సాధ్యమవుతుందన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని మేకగూడలో పొకర్ణ ఇంజనీర్ స్టోన్ లిమిటెడ్ క్వార్టజ్ క్వాన్టజ్ రెండవ యూనిట్ ను మంత్రి కేటీఆర్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోసమతుల్యమైన అభివృద్ధి జరుగుతుందని అందులో భాగంగా పల్లెల్లో పల్లె ప్రగతి,పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తీసుకు వెళుతుందని మంత్రి అన్నారు. 


రాష్ట్రంలో ఒకవైపుపారిశ్రామికీకరణకు ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇస్తూనే ఉపాధి కల్పనకు అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోవ్యవసాయానికి, కులవృత్తులకు ప్రాధాన్యతను ప్రభుత్వం కల్పిస్తుందని,గ్రామీణాభివృద్ధి , వ్యవసాయం , పరిశ్రమలు కలిసికట్టుగా ముందుకు నడిచినప్పుడు సమతుల్యమైన అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి అన్నారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ ఐపాస్ ద్వారావిప్లవాత్మకమైన విధానం వచ్చిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం వచ్చిందని అన్నారు. తెలంగాణలో పరిశ్రమ స్థాపించాలంటే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ టీఎస్ ఐపాస్ పోర్టల్ లో  దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అనుమతులు లభిస్తాయని అన్నారు.  


టీఎస్ ఐపాస్ వచ్చినప్పటినుండి 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని మంత్రి అన్నారు. మేక గూడ లో పరిశ్రమ స్థాపించిన పోకర్ణ ఇంజనీర్  స్టోన్ పరిశ్రమ యాజమాన్యానికి ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలిపారు.అనంతరం పరిశ్రమ వెబ్సైట్ క్వార్టజ్ క్వాన్టజ్ ను మంత్రి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ నియోజవర్గ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి ,పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్సెక్రెటరీ జయేష్ రంజన్ ,శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ,దామోదర్ రెడ్డి , షాద్ నగర్ శాసనసభ్యులు అంజయ్య యాదవ్ , చేవెళ్ల శాసన సభ్యులు కాలే యాదయ్య, మర్రి జనార్దన్ రెడ్డి, దానం నాగేందర్ , కంపెనీ చైర్మన్ గౌతం జైన్ ,రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా పరిషత్ వైస్చైర్మన్ ఈట గణేష్ , స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T22:34:47+05:30 IST