అభివృద్ధిలో పోటీ పడండి- కేటీఆర్
ABN , First Publish Date - 2021-04-19T21:06:04+05:30 IST
బిజేపీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేసే కంటే అభివృద్ధిసై పోటీ పడాలని మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.
సిరిసిల్ల : బిజేపీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేసే కంటే అభివృద్ధిసై పోటీ పడాలని మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రత్యేకించి ఆయన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో పలు అభివృద్ధిపనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ రెండేళ్ల కాలంలో ఒక ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గానికి పైసా తెచ్చారా? అంటూ ప్రశ్నించారు.
మతం పేరుతో రెచ్చగొట్టడం, చిల్లర రాజకీయాలు చేయడం సరికాదు. చేతనైతే అభివృద్ధిలో తమతో పోటీ పడాలని సవాల్ విసిరారు. చేతనైతే కేంద్రం నుంచి రాష్ర్టాభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలనారు. అలాగే దమ్ముంటే కాళేశ్వరం లేదా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకు రావాలని అన్నారు. అభివృద్ధిలో ఆరోగ్యకరపోటీ ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు.