ఘనంగా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు

ABN , First Publish Date - 2021-07-24T19:32:49+05:30 IST

మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను శనివారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు

హైదరాబాద్: మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను శనివారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లీడర్ అనే టైటిల్ తో సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన సీడీ ని హోంమంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించగా, పాట ప్రదర్శనను మాజీ ఎంఎల్సీ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం 44 కిలోలతో తయారు చేసిన కేక్ ను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎంఎల్సీ ప్రభాకర్, ఎంఎల్ఏ లు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, తలసాని సాయికిరణ్ యాదవ్ లతో కలిసి కట్ చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్ లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 


సామాజిక సేవా కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి తలసాని

మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిప్ట్ ఏ స్మైల్ క్రింద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద ఒక దివ్యాంగుడికి త్రిచక్ర వాహనాన్ని అందజేశారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కూకట్ పల్లి ఎంఎల్ఏ కృష్ణారావు ఆధ్వర్యంలో మొక్కలు నాటిన అనంతరం రక్తదాన శిభిరాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జూబ్లీహిల్స్ ఎంఎల్ఏ మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన్ శిభిరాన్ని మంత్రి ప్రారంభించారు.

Updated Date - 2021-07-24T19:32:49+05:30 IST