రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-03-14T23:38:14+05:30 IST

మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

హైదరాబాద్: మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి కుసంస్కారంగా మాట్లాడుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. మంత్రిపై రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. తక్షణమే రాజగోపాల్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 


అసెంబ్లీలో మంత్రి తలసాని, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లపై చర్చ సందర్భంగా పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. రాజగోపాల్‌రెడ్డిని కాంట్రాక్టర్‌తో పోల్చుతూ తలసాని మాట్లడారు. దీంతో మంత్రి తలసాని వ్యాఖ్యలపై రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాంట్రాక్టర్‌‌ను అయితే పేకాట ఆడినోళ్లు మంత్రులు కావొచ్చంటూ రాజగోపాల్‌రెడ్డి సెటైర్లు వేశారు. సింగరేణిపై లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరిగేషన్, సింగరేణిలో అవినీతి జరగలేదని నిరూపిస్తే మంత్రుల కాళ్లు కడిగి నెత్తిపై పోసుకుంటానని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. 


Updated Date - 2022-03-14T23:38:14+05:30 IST