వంతెనల నిర్మాణంతో తగ్గిన ట్రాఫిక్‌ ఒత్తిడి : KTR

ABN , First Publish Date - 2022-02-06T14:29:57+05:30 IST

నగరంలో లింక్‌/మిస్సింగ్‌ రోడ్లు అందుబాటులోకి వచ్చినచోట ప్రధాన రహదారులపై

వంతెనల నిర్మాణంతో తగ్గిన ట్రాఫిక్‌ ఒత్తిడి : KTR

హైదరాబాద్‌ సిటీ : నగరంలో లింక్‌/మిస్సింగ్‌ రోడ్లు అందుబాటులోకి వచ్చినచోట ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గిందని, ఆయా మార్గాల్లో అభివృద్ధికి అవకాశం కలుగుతుందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం రహదారి నిర్మాణ ప్రాజెక్టులపై జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, హెచ్‌ఎండీఏ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్‌ఆర్‌డీపీ వంతెనలు, అండర్‌పా‌స్‌లు, లింక్‌/మిస్సింగ్‌ రోడ్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.  నాలా అభివృద్ధి, విస్తరణ పనులు వేగవంతం చేయాలన్నారు. వచ్చే వర్షాకాలానికి సంబంధించి ఇప్పటి నుంచే అవసరమైన కార్యక్రమాలను చేపట్టాలని, ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా ఇప్పటికే చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. 

Updated Date - 2022-02-06T14:29:57+05:30 IST