శభాష్.. రాజశేఖర్
ABN , First Publish Date - 2020-09-25T10:10:00+05:30 IST
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్కు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్
గిఫ్ట్ ఏ స్మైల్కు స్పందించినందుకు అభినందించిన మంత్రి కేటీఆర్
కరోనా టెస్టింగ్ మొబైల్ వాహనం బహూకరించిన రాజశేఖర్
మేడ్చల్ అర్బన్: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్కు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి కరోనా టెస్టింగ్ మొబైల్ వాహనాన్ని బహుమతిగా అందజేశారు. గురువారం ప్రగతి భవన్ వద్ద మంత్రి కేటీఆర్ మొబైల్ వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం శభాష్.. రాజశేఖర్ అంటూ భుజం తట్టి మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఆలోచనా విధానం అద్భుతంగా ఉంటుందన్నారు. ఎందరికో ఉపయోగకరమైన కరోనా టెస్టింగ్ మొబైల్ వాహనాల కోసం కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు స్పందించి తన వంతు బాధ్యతగా వాహనాన్ని అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డుసభ్యులు మహేశ్వర్రెడ్డి, కేశవరెడ్డి, అనితాప్రభాకర్, పాండుయాదవ్, నళినికిరణ్, భాగ్యశ్రీశ్యామ్, లోకనాథ్ తదితరులు పాల్గొన్నారు.